Header Banner

సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా భారతీయులే.! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  Mon Apr 28, 2025 15:10        Politics

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాల్లో రాణిస్తున్నారని, సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అమరావతిలోని విట్ (VIT-AP) విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్-ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన 'వి-లాంచ్‌ ప్యాడ్ 2025' ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.

 

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, విట్-ఏపీలో 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని, అయితే కేవలం ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా, వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలను స్థాపించి, పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని, కేవలం 14 నెలల్లోనే హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించి చూపించామని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఐటీయే భవిష్యత్తు అని చెప్పానని, ఇప్పుడు కాలం మారిందని, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలు కీలకంగా మారాయని అన్నారు. ఇప్పుడు ఈ నూతన టెక్నాలజీలను ప్రోత్సహించడంపై దృష్టి సారించానని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్ ఉద్యోగానికి కూడా తీవ్ర పోటీ ఉండేదని, కానీ నేడు ఐటీ రంగంలో ఉద్యోగాలకు యువత అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇది మారిన ప్రాధాన్యతలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్.వి. కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations